వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడపలో ఘోర ప్రమాదం: 8 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

కడప: కడప జిల్లాలోని నంద్యాల - ఆళ్లగడ్డ జాతీయ రహదారిపై దీబగుంట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లా నుంచి మంత్రాలయం వెళ్తున్నవారి వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసి బస్సు హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్తోంది.

ఐదుగురు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్‌ చెప్పారు. మరో ముగ్గురు క్షతగాత్రులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకంగా ఉంది. రోడ్డు ప్రమాదంలో మరణించివవారి శవాలను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X