వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కడపలో ఘోర ప్రమాదం: 8 మంది మృతి
కడప: కడప జిల్లాలోని నంద్యాల - ఆళ్లగడ్డ జాతీయ రహదారిపై దీబగుంట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లా నుంచి మంత్రాలయం వెళ్తున్నవారి వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసి బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తోంది.
ఐదుగురు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ చెప్పారు. మరో ముగ్గురు క్షతగాత్రులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకంగా ఉంది. రోడ్డు ప్రమాదంలో మరణించివవారి శవాలను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Story first published: Monday, May 30, 2005, 23:53 [IST]