ఒకరి అరెస్టు: వీడిన పాస్లర్ల హత్య కేసుల మిస్టరీ
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పాస్టర్ల హత్య కేసుల మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసుల్లో కీలక నిందితుడు గోవర్దన్ అనే యువకుడిని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు సంయుక్త దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. మత మార్పిడులకు పాల్పడుతుందు వల్లనే పాస్టర్లు డేనియల్, ఐజాక్ రాజులను హత్య చేసినట్లు గోవర్దన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. అతనికి సహకరించిన సత్యనారాయణ, గోపాల్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఈ హత్యలు వ్యక్తిగత కారణాల వల్లనే జరిగాయని పోలీసులు మొదట జరిగాయని భావించినప్పటికీ రెండు హత్యలు ఒకే విధంగా జరగడంతో పోలీసుల దృష్టి మరో వైపు వెళ్లింది. తమ అదుపులో ఉన్న గోవర్దన్కు హిందూ మత సంస్థలతో సంబంధాలున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తనకు హిందూ వాహినితో సంబంధాలున్నాయని గోవర్దన్ అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. జూన్ 25వ తేదీన కిడ్నాప్ అయిన హైదరాబాద్లోని ఆసిఫ్నగర్కు చెందిన పాస్టర్ ఐజాక్ రాజు మూడు రోజుల తర్వాత షంపాబాద్లో శవమై తేలాడు. ఆ తర్వాత రాయదుర్గకు చెందిన డేనియల్ శవం జులై రెండో తేదీన పోలీసులకు కనిపించింది. వీరిద్దరిని వారి వారి ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లి హత్య చేశారు.
గోవర్దన్ హైదరాబాద్లోని కార్వాన్ నివాసి అని పోలీసులు చెప్పారు. మూడు రోజుల విచారణ తర్వాత గోవర్దన్ తనకు సహకరించినవారి పేర్లు వెల్లడించినట్లు సమాచారం.