ప్రభుత్వ ప్రతిష్టభేష్: కేశవరావు కితాబు
న్యూఢిల్లీ: వశిష్టవాహన్ కంపెనీలో రూ.11కోట్లకు పైగా ప్రభుత్వంపెట్టుబడులు పెట్టడం వల్ల ప్రభుత్వ ప్రతిష్టఅంత దిగజారలేదని, ఎక్కువ సమర్ధవంతంగాతమ ప్రభుత్వం పనిచేస్తుందనిపిసిసి అధ్యక్షుడు కేశవరావు అన్నారు.మంగళవారం ఆయన విలేకరులతోమాట్లాడుతూ వశిష్ట వాహన్ వ్యవహారంఅంతా చట్టబద్దంగానే జరిగిందని తను భావిస్తున్నట్లు తెలిపారు.అయితే వశిష్టవాహన్ కంపెనీ అధీకృత మూలధనంరూ. 5కోట్లు అన్న మాట నిజమైతే అంతకన్నాఎక్కువగా రూ.11.2కోట్లు పెట్టుబడి పెట్టడం మాత్రంచట్ట విరుద్దమే అవుతుందని అన్నారు.వోక్స్ వ్యాగన్ కార్ల కంపెనీని రాష్ట్రానికితీసుకురావాలన్న సదుద్ధేశంతోనే ఈవ్యవహారమంతా జరిగిందని అయితే ఈవిషయంలో పత్రికలు ఘోషిస్తున్నంతగా ప్రభుత్వప్రతిష్ట దిగజారలేదని అన్నారు. రానున్నమున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఘనవిజయాన్నిసాధించి తమ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలన్నింటికీసమాధానమిస్తుందని అన్నారు.