వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫాక్షనిజానికి ఇక నేను దూరం: సూరి
అనంతపురం: ఫాక్షనిజానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి అన్నారు. పంటి నొప్పికి చికిత్స కోసం ఆయనను బుధవారం ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ఆ మాటలన్నారు. తన పేరు చెప్పి తెలుగుదేశం పార్టీవారే చందాలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన పేరు చెప్పి చందాలు వసూలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని తాను పోలీసులను కోరినట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Wednesday, July 20, 2005, 23:53 [IST]