వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్యం అందిస్తే రాజకీయమా?: చంద్రబాబు ప్రశ్న

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: మలేరియా, అంత్రాక్స్‌ వంటి వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులకు తాము వైద్యం అందిస్తే రాజకీయమంటే ఎలా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గిరిజనులకు వైద్యసేవలందించే విషయంలో తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తుందనే కొందరు మంత్రుల విమర్శలకు ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. విశాఖపట్నం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించారు.

గిరిజనులు మలేరియా, అంత్రాక్స్‌ వంటి వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్నారని, ప్రభుత్వం గిరిజనుల పట్ట పూర్తి నిర్లక్ష్యవైఖరి ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంటే తాము వైద్య సేవలు అందిస్తున్నామని, దీన్ని రాజకీయమనడం ఏ మాత్రం సమంజసంకాదని ఆయన అన్నారు. పాలకపక్షం పట్టించుకోకపోతే ప్రజల్లో ఉండి వారికి సహాయం అందించేలా చూడటం ।పతిపక్షం బాధ్యత అని, ఆ బాధ్యతను తాము నిర్వర్తిస్తున్నామని ఆయన అన్నారు. విశాఖ గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని అంటూ మంత్రులు నిద్రపోతున్నారా అని ఆయన అడిగారు. తాము కదిలిన తర్వాతే మంత్రులు నిన్న గిరిజన ప్రాంతాలకు వచ్చారని, ఇంతకాలం వారు నిద్రపోతున్నారా అని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X