వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్, భానుమతి, జెసిల సంగతేమిటి?: కోర్టు ప్రశ్న
అనంతపురం: తెలుగుదేశం శానసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో ముఖ్యమంత్రి తనయుడు వై.యస్. జగన్మోహన్ రెడ్డి, మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు గంగుల భానుమతి విషయాల గురించి ఏమి చేశారని అనంతపురం కోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)ని ప్రశ్నించింది. పరిటాల హత్య కేసులో ఆయన బంధువులు ఈ ముగ్గురి ప్రమేయం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
పరిటాల హత్య కేసులో ప్రధాన నిందితుడు జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీనును ఆగస్టు 4వ తేదీలోగా తమ ముందు హాజరు పర్చాలని, లేకపోతే కేసును విడగొట్టాల్సి వస్తుందని కోర్టు సిబిఐతో అన్నది. పరిటాల హత్య కేసులో మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరితో పాటు మిగతా నిందితుల రిమాండ్ను కోర్టు వచ్చే నెల 4వ తేదీకి పొడిగించింది.
Comments
Story first published: Thursday, July 21, 2005, 23:53 [IST]