వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రజల దరఖాస్తులు పరిశీలించండి: వైయస్ ఆదేశం
ఒంగోలు: రాజీవ్నగర్ బాట సందర్భంగా ప్రజల నుంచి అందిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల ఆశలకు అనుగుణంగా అధికారులు వ్యవహరించాలని ఆయన సూచించారు. ఆదివారంనాడు ఆయన ప్రకాశం జిల్లాలో రాజీవ్నగర బాట నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం, తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
50 వేల మంది చేనేత కార్మికులకు పింఛన్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరు పెడతామని ఆయన హామీ ఇచ్చారు. మార్కాపురంలో ఐదు కోట్ల రూపాయలతో తలపెట్టని రాజీవ్ గృహకల్ప పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు.
Story first published: Sunday, July 31, 2005, 23:53 [IST]