కరీంనగర్లో బాంబు పేలుడు: 15 మందికి గాయాలు
కరీంనగర్: కరీంనగర్ బస్ స్టేషన్లో మంగళవారం ఉదయం బాంబు పేలింది. ఆర్టీసి సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ బాంబు పేలుడు సంఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురు కరీంనగర్ - 2 డిపోకు చెందిన ముగ్గురు డ్రైవర్లు, ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రుల్లో 8 మందిని వరంగల్లోని యంజియం ఆస్ప6తికి తరలించారు. బాంబు పేలుడు కారకులెవరనేది ఇప్పుడే చెప్పలేమని జల్లా పోలీసు సూపరింటిండెంట్ చౌహాన్ చెప్పారు.
కరీంనగర్ బస్స్టేషన్లోని ఐదు, ఆరు ప్లాట్ఫారాలపై ముంబాయి, నిజామాబాద్లకు వెళ్లే బస్సులు నిలుచుని ఉన్నాయి. ఈ రెండు బస్సులకు మధ్య టిఫిన్ బాక్స్లోంచి పొగలు రావడం గమనించి ఆర్టీసి సిబ్బంది పెద్దగా కేకలు పెట్టారు. దీంతో ప్రయాణికులు దూరంగా పారిపోయారు. టిఫిన్ బాక్స్లోని బాంబు పేలింది. ఈ ఘటనలో రెండు బస్సుల అద్దాలు పగిలిపోయాయి. ఒక బస్సు టైర్ పగిలిపోయింది. ఇటువంటి తరహా బాంబులను అమర్చడం ఐయస్ఐకి అలవాటని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications