వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌పై కాల్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నా: భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్‌ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌పై హత్యాప్రయత్నం జరిగింది. బీహార్‌లోని ససారం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించడానికి లేచిన సమయంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆయన ఎడమ భుజానికి బుల్లెట్‌ గాయం అయింది. దాంతో అగ్రహోద్రగులైన బిజెపి కార్యకర్తలు కాల్పులు జరిపిన దుండగుడిపై విరుచకుపడ్డారు. ఈ దాడిలో దుండగుడు మరణించాడు.

ఈ ఎన్నికల ప్రచార సభలో బిజెపి సీనియర్‌ నాయకుడు ప్రమోద్‌ మహాజన్‌ కూడా వేదికపై ఉన్నారు. సపారంలో రవిశంకర్‌ ప్రసాద్‌కు చికిత్స చేశారు. ఆ తర్వాత ఆయనను పాట్నాలోని ఆలోక్‌ ఆస్పత్రికి తరలించారు. రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని బిజెపి సీనియర్‌ నాయకుడు అరుణ్‌ జైట్లీ ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X