వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్పై కాల్పులు
పాట్నా: భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్పై హత్యాప్రయత్నం జరిగింది. బీహార్లోని ససారం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించడానికి లేచిన సమయంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆయన ఎడమ భుజానికి బుల్లెట్ గాయం అయింది. దాంతో అగ్రహోద్రగులైన బిజెపి కార్యకర్తలు కాల్పులు జరిపిన దుండగుడిపై విరుచకుపడ్డారు. ఈ దాడిలో దుండగుడు మరణించాడు.
ఈ ఎన్నికల ప్రచార సభలో బిజెపి సీనియర్ నాయకుడు ప్రమోద్ మహాజన్ కూడా వేదికపై ఉన్నారు. సపారంలో రవిశంకర్ ప్రసాద్కు చికిత్స చేశారు. ఆ తర్వాత ఆయనను పాట్నాలోని ఆలోక్ ఆస్పత్రికి తరలించారు. రవిశంకర్ ప్రసాద్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని బిజెపి సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ ప్రకటించారు.
Comments
Story first published: Thursday, October 6, 2005, 23:53 [IST]