హైదరాబాద్లో స్కైబస్సు మెట్రోకు ఏర్పాట్లు
హైదరాబాద్: ప్రపంచంలోనే హైదరాబాద్లో తొలి స్కైబస్ మెట్రో ఏర్పాటుకు ఒక ప్రముఖ మలేషియా కంపెనీ భారత ప్రభుత్వంతో చర్చలకు ముందుకు వస్తోంది. వచ్చే నెల ప్రారంభంలో సాంకేతిక సాధ్యాసాధ్యాలను అధ్యయనం ముగిసిన తర్వాత మలేషియా కంపెనీ ప్రతినిధులు భారత ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. సాధ్యాసాధ్యాల అధ్యయనం గత నెల ప్రారంభమైంది. వచ్చే నెల 5వ తేదీ నాటికి అధ్యయనం, సంప్రదింపులు ముగిసే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో స్కైబస్సు మెట్రో నిర్మాణం ప్రారంభమై 2008 నాటికి పూర్తవుతుంది.
టెక్నాలజీ పార్ట్నర్ కొంకణ్ రైల్వేస్ సహకారంతో మలేషియా కంపెనీ డోక్స్పోర్ట్ టెక్నాలజీస్ హైదరాబాద్లోని ఉప్పల్ నుంచి మెహిదీపట్నం వరకు స్కైబస్సును నిర్మించే విధివిధానాలను రూపొందిస్తోంది. ఇది అత్యంత చౌకగా లభించే రవాణా సౌకర్యమని, కిలోమీటర్కు 50 పైసలు మాత్రమే ఖర్చవుతుందని డోక్స్పోర్ట్ కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.