వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసి సమ్మె అనర్థదాయకం: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కేసులో విప్లవ రచయితల సంఘం (విరసం) అధ్యక్షుడు జి. కల్యాణరావుకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఐదు వేల రూపాయల ధరావత్తు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో నాంపల్లి కోర్టు బుధవారం కల్యాణ రావుకు బెయిల్‌ మంజూరు చేసింది. అనంతపురం జిల్లా మదిగుబ్బలో కానిస్టేబుల్‌పై హత్యా ప్రయత్నం కేసులో అనంతపురం కోర్టు కల్యాణరావుకు జ్యుడిషయల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కేసులో బెయిల్‌ లభించినా ఆయన జైలులోనే వుండాల్సి వస్తోంది. కాగా, విరసం నేత వరవరరావు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది.

ఇదిలావుంటే, విరసం నాయకులు కల్యాణరావు, వరవరరావుల అరెస్టు విషయంలో ఆర్టికల్‌ 22ను ఉల్లంఘించారని రాష్ట్ర మానవ హక్కువ సంఘం అభిప్రాయపడింది. ఈ ఇరువురి అరెస్టుపై పోలీసులు తమ వాదనను బుధవారం రాష్ట్ర మానవ హక్కుల సంఘం ముందు వినిపించారు. విరసంపై నిషేధం నోటిఫికేషన్‌ను పత్రికల్లో ప్రచురించారా, లేదా అని మావన హక్కుల సంఘం పోలీసులను ప్రశ్నించింది. ఈ నెల 27వ తేదీలోగా నోటిఫికేషన్‌ను ప్రచురిస్తామని పోలీసుల తరఫు న్యాయవాది సత్యప్రసాద్‌ తెలియజేశారు. అరెస్టుల విషయంలో నిబంధనలు పాటించని విషయమై ఈ నెల 27వ తేదీన మానవహక్కుల సంఘం విచారిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X