బాబుపై కడప జిల్లా పార్టీ ఎమ్యెల్యే తిరుగుబాటు
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించిన మొబిలైజేషన్ అడ్వాన్స్ల వినియోగం తీరుపై బుధవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చెలరేగింది. ప్రభుత్వం చెల్లించిన మొబిలైజేషన్ అడ్వాన్స్ల డబ్బును కాంట్రాక్టర్లు వ్యాపార కార్యకలాపాలకు వాడుతున్నారని, బెంగుళూర్ వంటి ప్రదేశాల్లో చిట్ఫండ్ కంపెనీలు నడపడం వంటి పనులకు వాటిని వినియోగిస్తున్నారని తెలుగుదేశం శాసనసభ్యుడు మనోహర్ విమర్శించారు.
మొబిలైజేషన్ అడ్వాన్స్లను కాంట్రాక్టర్లు ఏ రకంగా వాడుకుంటున్నారనేది ప్రభుత్వానికి సంబంధం లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. దీనికి తెలుగుదేశం సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. కాంట్రాక్టర్లు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మొబిలైజేషన్ అడ్వాన్స్లపై ప్రభుత్వం 8 శాతం వడ్డీ వసూలు చేస్తోందని మంత్రి చెప్పారు. మొబిలైజేషన్ అడ్వాన్స్లను కాంట్రాక్టర్లు ఒప్పందాలను అతిక్రమిస్తే ముక్కు పిండి వసూలు చేస్తామని ఆయన చెప్పారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని తెలుగుదేశం సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.