ముస్లిమ్ రిజర్వేషన్లపై సుప్రీంలోనూ చుక్కెదురు
న్యూఢిల్లీ: ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. విద్య, ఉద్యోగాల్లో ముస్లిమ్లకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఇప్పటికే రిజర్వేషన్లు పొందిన ముస్లిమ్లకు తమ నిర్ణయం వర్తించిందని ఛీఫ్ జస్టిస్ వై.కె. సబర్వాల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ తెలియజేసింది. ముస్లిమ్ రిజర్వేషన్ల అంశాన్ని బెంచ్ సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనానికి నివేదించింది. ముస్లిమ్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రాజ్యాంగవిరుద్ధమని ప్రకటిస్తూ ఆ ఉత్తర్వులను కొట్టివేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అపీల్ చేసింది.