వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమ భూ విక్రయాల్లో ఎంపిపి అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌: భూముల అక్రమ విక్రయాల కేసులో మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరు మండల పరిషత్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌ గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విలేజ్‌ అసిస్టెంట్‌ ఆఫీసర్‌ (విఇఒ), సబ్‌ రిజిస్ట్రార్‌లపై పోలీసులు కేసు పెట్టారు. వేణుగోపాల్‌ గౌడ్‌తో పాటు ఈ కేసులో 14 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌ (యస్పీ) శ్రీనివాస రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు.

యస్పీ చెప్పిన వివరాల ప్రకారం: వేణుగోపాల్‌ గౌడ్‌ రాములు అనే వ్యక్తి సహకారంతో సత్యనారాయణ అనే మాజీ సైనికోద్యోగి భూముల విక్రయాలకు పాల్పడ్డాడు. సత్యనారాయణ ఏనాడో మరణించాడు. అయితే సత్యనారాయణ పేరు మీద మరో వ్యక్తిని సృష్టించి, ఇతనే సత్యనారాయణ అంటూ భూములను రిజిష్టర్‌ చేయడం మొదలు పెట్టాడు. ఎకరానికి 5 లక్షల 50 వేల రూపాయలకు సత్యనారాయణ భూములను అమ్ముతూ పోయాడు. ఈ విక్రయాలు నిరుడు జరిగాయి. ఈ భూముల విలువ దాదాపు 80 లక్షల రూపాయల రూపాయల దాకా ఉంటుంది. ఈ విషయమై సత్యనారాయణ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వేణుగోపాల్‌ గౌడ్‌ను, అతనికి సహకరించినవారిని అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X