ఒక్క ఆరోపణను కూడా రుజువు చేయలేదు: వైయస్
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై 38 ఆదివారాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఒక ఆరోపణనైనా రుజువు చేయగలిగారా అని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. పచ్చకామెర్లున్నవారికి అంతా పచ్చగానే కనిపిస్తుందని ఆయన అన్నారు. వ్యవసాయ సాంకేతిక మిషన్ను ఆయన ఆదివారంనాడు ప్రారంభించారు. ఆరద్శ రైతులకు, అధికారులకు అవార్డులు ప్రదానం చేశారు.
సాగునీటి ప్రాజెక్టులను చేపట్టాలనుకోవడమే గొప్ప విషయమని ఆయన అన్నారు. రైతులకు వ్యవసాయ విస్తరణాధికారుల అవసరం ఉందని ఆయన అన్నారు. వ్యవసాయం అంటే వరిపోలమే కాదని, పశుపోషణ, హార్జీకల్చర్, గొర్రెల పెంపకం, పౌల్ట్రీ కూడా అని ఆయన అన్నారు. ప్రతి రైతు ఉత్తమ రైతుగా రూపొందాలని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. వ్యవసాయంలో జాతీయ వృద్ధిరేటును నాలుగు శాతం పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.