వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ ప్లీనరీ: హైదరాబాద్‌లో ఆంక్షలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఎఐసిసి) ప్లీనరీ సందర్భంగా పోలీసులు హైదరాబాద్‌లో భారీ ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌లో 144వ సెక్షన్‌ విధించారు. ఐదు రోజుల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ ఆంక్షలు 24వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అమలులో ఉంటాయి. ఐదుగురు కన్నా ఎక్కువ మంది గుమికూడితే చర్యలు తీసుకుంటారు.

ప్రజల సాధారణ జనజీవనానికి ఆటంకం కలగకుండా ఉండడానికే ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మాలమహానాడు, మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ర్యాలీలు, బహిరంగ సభలు తలపెట్టిన నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్లు వారంటున్నారు. ఈ రెండు ప్రజా సంఘాల సభలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. షెడ్యూల్డ్‌ కులాల ( ఎస్‌సి) రిజర్వేషన్ల వర్గీకరణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (యం ఆర్‌పియస్‌) కురుక్షేత్ర యుద్ధం పేర ర్యాలీ తలపెట్టింది. కాంగ్రెస్‌ ప్లీనరీని భగ్నం చేస్తామని యమ్మార్పియస్‌ నాయకుడు మంద కృష్ణ మాదిగ ప్రకటించారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలమహానాడు ర్యాలీ తలపెట్టింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X