వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోదావరి తీరంలో పరుగుల ఉత్సాహం

By Staff
|
Google Oneindia TeluguNews

తాడేపల్లిగూడెం: గోదావరి తీరంలో గురువారంనాడు పరుగుల వరద పారింది. రాజమండ్రిలో 5కె రన్‌, తాడేపల్లిగూడెంలో 7కె రన్‌ ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

తారల, క్రీడాకారుల తళుకుబెళుకులతో 7 కె రన్‌ తాడేపల్లిగూడెంలో గురువారం ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ రన్‌లో దాదాపు 15 వేల మంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ప్రధాన వీధుల గుండా ఈ రన్‌ సాగింది. సినీనటులు రంభ, ఎం.యస్‌. నారాయణ, దర్శకుడు వి.వి. వినాయక్‌, క్రీడాకారులు అజహరుద్దీన్‌, ముఖేష్‌కుమార్‌, ఎ.టి. రాయుడు తదితరులు పాల్గొన్నారు.

రాజమండ్రిలో 5కె రన్‌ జరిగింది. ప్రముఖ సినీనటుడు సుమన్‌ ఈ రన్‌ను ప్రారంభించారు. పుష్కరఘాట్‌ నుంచి ప్రారంభమైన ఈ రన్‌ ఆర్ట్స్‌ కళాశాల మైదానానికి చేరుకుంది. అనంతరం అక్కడ జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో పొల్గొన్నారు. ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు ఈ కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X