For Daily Alerts
కర్నాటక సిఎం ధరమ్ సింగ్ రాజీనామా
బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన రాజీనామాను ఆయన ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం గవర్నర్తో సమావేశమైనపుడు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవడంలో విఫలమైనందుకు రాజీనామా చేయమని గవర్నర్ చతుర్వేది ఆయన్ను కోరారని సమాచారం. బలాన్ని నిరూపించుకోవడానికి ధరమ్ మరికొంత సమయం అడిగారని, అయితే గవర్నర్ అందుకు నిరాకరించారని తెలుస్తోంది. పరిస్థితిని అర్ధం చేసుకున్న ధరమ్ సింగ్ రాజీనామా లేఖను గవర్నర్కు పంపించారు. ఆయన కార్యదర్శి ఎస్వి రంగనాథ్ రాజీనామా లేఖను గవర్నర్కు అందించారు. పదవిని అంటిపెట్టుకొనే స్వభావం తనకు లేదని, బల నిరూపణకు మరింత సమయం ఇవ్వలేనని గవర్నర్ తెలిపారని అందుకే రాజీనామా చేస్తున్నానని ధరమ్ విలేకరులకు తెలిపారు.
Story first published: Saturday, January 28, 2006, 23:53 [IST]