పారిస్లో పెన్నెట్టాపై సానియా విజయం
పారిస్: డబ్ల్యుటిఎ టూర్ టోర్నమెంట్లో భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా శుభారంభం చేసింది. సానియా మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ఇటలీకి చెందిన ఆరో సీడ్ పెన్నెట్టాపై వరస సెట్లలో విజయం సాధించింది. పెన్నెట్టాపై సానియా 16వ ప్రపంచ ర్యాంకర్ పెన్నెట్టాపై 6-2, 7-6(5) స్కోర్తో గెలిచింది.
సానియా రెండో రౌండ్లో ఫ్రెంచ్ టెన్నిస్ క్రీడాకారిణి టాటియానా గోలోవిన్తో తలపడుతుంది. గోలోవిన్ పోలండ్కు చెందిన మార్టా దోమాచోవస్కాను 6-0, 7-5 స్కోర్తో ఓడించింది. జపాన్లో అక్టోబర్లో జరిగిన పోటీలో ఓటమికి గోలోవిన్పై ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోగలనని ఆశిస్తున్నట్లు సానియా వ్యాఖ్యానించింది.
అన్ సీడెడ్గా పోటీలోకి దిగిన సానియా పెన్నెట్టాపై తొలి సెట్లో పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. రెండ్ సెట్ మాత్రం హోరాహోరీ జరిగింది. ఒక పాయింట్ ఆధిక్యతతో సానియా విజయం ఖాయమైంది. ఈ మ్యాచ్ గంటా 25 నిమిషాల పాటు సాగింది. ప్రమాణాలున్న క్రీడాకారిణిని ఓడించడం గొప్ప భావనకు గురి చేస్తుందని, ఇది తన ఉత్తమ విజయాల్లో ఒకటని సానియా అన్నది. ఆస్ట్రేలియా ఓపెన్లో పెన్నెట్టా మంచి ఫామ్ను ప్రదర్శించిందని, అటువంటి ప్లేయర్ను ఓడించడం ఆనందాన్నిచ్చిందని అన్నది.