For Daily Alerts
హెడ్ కానిస్టేబుల్ను కాల్చి చంపిన మావోయిస్టులు
మహబూబ్నగర్/హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలో హెడ్ కానిస్టేబుల్ జహంగీర్ అలీని బుధవారంనాడు మావోయిస్టులు కాల్చి చంపారు. బల్మూర్ పోలీసు స్టేషన్కు చెందిన జహంగీర్ అలీ ఏదో పని మీద కొండనాగుల గ్రామానికి వచ్చారు. ఈ సమయంలో మావోయిస్టులు అతడ్ని కాల్చి చంపారు. కాల్పులకు గురైన సమయంలో జహంగీర్ అలీ విధుల్లో లేడని తెలుస్తోంది.
హెడ్ కానిప్టేబుల్ను మావోయిస్టులు హత్య చేయడాన్ని హోం మంత్రి కె. జానారెడ్డి ఖండించారు. హెడ్ కానిస్టేబుల్ను మావోయిస్టులు కాల్చి చంపడం పిరికిపందల చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. జహంగీర్ అలీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
Story first published: Wednesday, March 8, 2006, 23:53 [IST]