For Daily Alerts
తెలుగు అభివృద్ధికి మంత్రిత్వశాఖకై వినతి
హైదరాబాద్: తెలుగు భాషాభివృద్ధి కోసం కర్నాటక తరహాలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రముఖ తెలుగు సాహితీవేత్తలు, భాషోద్యమ నేతలు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని బుధవారం కోరారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి నేతృత్వంలో ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యదర్శి ఎల్లూరి శివారెడ్డి, తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు ధర్మారావు, పాత్రికేయుడు జిఎస్ వరదాచారి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎబికె ప్రసాద్ ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిశారు. పట్టణాల్లో కూడా కనీసం ఐదో తరగతి వరకు ప్రాధమిక విద్యను తప్పనిసరిగా తెలుగు మాధ్యమంలో బోధించాలని, తెలుగు భాష అమలును పర్యవేక్షించేందుకు ఒన ఉన్నతాధికారిని నియమించాలని కోరారు.
Story first published: Wednesday, March 29, 2006, 23:53 [IST]