వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చౌటుప్పల్ వద్ద ప్రమాదం: ఐదుగురి మృతి
హైదరాబాద్: నల్గొండ జిల్లా జాతీయ రహదారి లోని చౌటుప్పల్ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు హైదరాబాద్లోని కామినేని ఆస్పత్రిలో ప్రాణాపాయ స్ధితిలో చికిత్స పొందుతున్నారు. రెండు మోటారు వాహనాలు ఢీకొని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో లారీ డ్రైవర్, క్లీనర్, బైక్ మీద ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ప్రాణాపాయ స్ధితిలో ఉన్న మరో ఇద్దరిని కామినేని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.
Story first published: Saturday, May 6, 2006, 23:53 [IST]