పాటియాల కోర్టులో రాహుల్ హాజరు
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాల వినియోగం కేసులో బిజెపి నేత దివంగత ప్రమోద్ మహాజన్ కుమారుడు రాహుల్ మహాజన్ను పోలీసులు మంగళవారం పాటియాల కోర్టులో హాజరు పరిచారు. ఆయనపై పోలీసులు మాదక ద్రవ్యాల వినియోగం, వాడకానికి ప్రోత్సాహం, సాక్ష్యాల తారుమారు అభియోగాలను పోలీసులు మోపారు. అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే ఆయనను తుగ్లక్ రోడ్ పోలీసు స్టేషన్కు తరలించారు. రాహుల్కు వ్యతిరేకంగా తమ వద్ద బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు.రాహుల్ మహాజన్ను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాహుల్కు వైద్యం చేసిన హరీష్ శర్మ పేరును కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. రాహుల్ను పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. మంగళవారం మధ్యాహ్నం రాహుల్ మహాజన్ను అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అపస్మారక స్థితిలో రాహుల్ను గురువారం రాత్రి అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రికి చేర్చే లోగానే ప్రమోద్ మహాజన్ వ్యక్తిగత కార్యదర్శి వివేక్ మొయిత్రా మృతి చెందారు. రాహుల్కు, మొయిత్రాకు డ్రగ్స్ సరఫరా చేశారనే ఆరోపణపై పోలీసులు కాశ్మీరీ విద్యార్థి సాహిల్ జారూను, మరో ముగ్గురిని అరెస్టు చేశారు.