వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సూరి, మొద్దు శీనుల రిమాండ్ పొడగింపు
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి, జూలకంటి శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్దు శీనులతో పాటు నిందితులందరినీ పోలీసులు గురువారం అనంతపురం కోర్టులో హాజరు పరిచారు. చర్లపల్లి జైలులో ఉన్న మొద్దుశీనును ఇతర నిందితులను అనంతపురం తరలించారు. వారి రిమాండ్ను ఈ నెల 26వ తేదీ వరకు పొడగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 26వ తేదీ వరకు మొద్దు శీనును, ఇతర నిందితులను అనంతపురం జైలులో ఉంచాలన్న వారి తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఇంతకు ముందు ఉన్న జైళ్లకే నిందితులను తరలించాలని కోర్టు ఆదేశించింది.
Story first published: Thursday, June 8, 2006, 23:53 [IST]