వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నవంబర్ నాటికి శాసనమండలి: వైయస్
న్యూఢిల్లీ: నవంబర్ నాటికి శాసనమండలిని పునరుద్ధరించనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి కేంద్ర న్యాయ శాఖ మంత్రి హెచ్. ఆర్. భరద్వాజకు చెప్పారు. ఆయన శుక్రవారం ఉదయం భరద్వాజతో సమావేశమయ్యారు. శాసన మండలికి సంబంధించిన నియోజక వర్గానలు ఖరారు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అంతకు ముందు ఆయన కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి సంతోష్ మోహన్దేవ్తో సమావేశమయ్యారు.
హైదరాబాద్లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డికి సూచించారు. హైదరాబాద్ తీవ్రవాదుల అడ్డాగా మారుతోందనే ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. నక్సల్స్ సమస్యపై, శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హోం మంత్రి శివరాజ్ పాటిల్ను కోరారు.
Story first published: Friday, July 14, 2006, 23:53 [IST]