వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెరాస అరాచకం సృష్టిస్తే సహించం: వైయస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అరాచాకాలు సృష్టిస్తే సహించబోమని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హెచ్చరించారు. తెరాస తీరుపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ అంశం మీదనైనా చర్చకు ఒక పద్ధతి ఉంటుందని ఆయన అన్నారు. నిరసన పేరుతో తెరాస శాసనసభ్యులు అరాచాకాలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన అన్నారు.
తెరాస శాసనసభ్యులు శాసనసభ్యులు చర్చకు ఒక పద్ధతి ప్రకారం ముందుకు రావాలని ఆయన అన్నారు. నిరసన పేరుతో అరాచకం సృష్టించడం మంచిది కాదని ఆయన అన్నారు. సభలో అంశం చర్చకు రాకుండా అరాచకాలు సృష్టించడం ఏ సభ్యుడికీ మంచిది కాదని ముఖ్యమంత్రి అన్నారు.ప్రజలు వారిని గమనిస్తూనే వున్నారని ఆయన అన్నారు.
Story first published: Thursday, August 24, 2006, 23:53 [IST]