హత్యలు మీవంటే మీవి: టిడిపి, కాంగ్రెస్
హైదరాబాద్/ కర్నూలు: హత్యలకు పాల్పడుతోంది మీరంటే మీరని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోసుకున్నాయి. పోలీసుల సహకారంతోనే కాంగ్రెస్పార్టీవారు తమ పార్టీ నాయకులపై, కార్యక్తలపై దాడులు చేసి హత్యలకు ప్పాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేత కడియం శ్రీహరి విమర్శించారు. కర్నూలు జిల్లా ఎరుకలచెరువు గ్రామంలో ఈ రోజు జరిగిన సంఘటన అందుకు నిదర్శనమని ఆయన సోమవారం హైదారాబాద్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఫాక్షన్ హత్యలను అరికట్టని పోలీసులను సస్పెండ్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడేమంటుందని ఆయన అడిగారు. పోలీసులు తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాల్లో పోలీసులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని, పోలీసులు కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీవారు ఉనికి కోసమే తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి హత్యలకు పాల్పడుతోందని కర్నూలు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లా ఎరుకలచెరువు గ్రామంలో జరిగిన ఘర్షణలో గాయపడినవారిని ఆయన పరామర్శించారు. కుటుంబ తగాదాలను రాజకీయ కక్షలుగా మార్చి తెలుగుదేశం పార్టీ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. రాజకీయంగా ముందుకు వస్తే మంచిదని, అలా కాకుండా తెలుగుదేశం పార్టీ దాడులకు దిగడం సరైంది కాదని ఆయన అన్నారు.