వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక భీమా సదుపాయం
ముంబయ్: ప్రైవేట్ రంగ బీమా సంస్థ ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నవంబర్ ఒకటి నుంచి మధుమేహ రోగులకే ప్రత్యేకంగా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రారంభిస్తున్నది. డయాబెటిస్ కేర్ పేరుతో ప్రారంభిస్తున్న ఈ స్కీమ్ తొలి దశలో పన్నెండు నగరాల్లో ప్రారంభిస్తున్నారు. బీమా రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథార్టీ నుంచి కొద్దిరోజుల క్రితమే అనుమతి లభించినట్టుగా ప్రూడెన్షియల్ ఐసిఐసిఐ సిఇవో, ఎండి శిఖా శర్మ వెల్లడించారు. ప్రపంచంలోని మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో ఇరవై శాతం మంది భారత్లోనే ఉన్నారని ప్రపంచానికి డయాబెటిస్ కాపిటల్గా భారత్ను పరిగణిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు సరైన సంరక్షణ, ఆర్థిక మద్దతు అందించాలనే లక్ష్యంతో ఈ స్కీమ్ ప్రారంభించినట్టు ఆయన చెప్పారు.
Story first published: Sunday, October 29, 2006, 23:53 [IST]