వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ పర్యటనలతో ఒరిగిందేమీ లేదు: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టరులో తిరగడం తప్ప దాని వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనను ముగించుకుని ఆయన శుక్రవారం తూర్పు గోదావరి జల్లా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని, ఈ విషయం తన పర్యటనలో స్పష్టంగా కనిపించిందని ఆయన అన్నారు. పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X