వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ పర్యటనలతో ఒరిగిందేమీ లేదు: బాబు
రాజమండ్రి: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టరులో తిరగడం తప్ప దాని వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనను ముగించుకుని ఆయన శుక్రవారం తూర్పు గోదావరి జల్లా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని, ఈ విషయం తన పర్యటనలో స్పష్టంగా కనిపించిందని ఆయన అన్నారు. పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, September 15, 2007, 23:53 [IST]