వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు
తిరుపతి: తిరుమలలో ఈ సాయంత్రం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. తిరుమల మొత్తం బ్రహ్మోత్సవాలతో కళకళలాడుతోంది. లక్షలాది భక్తులు విచ్చేసే ఈ ఉత్సవాలకు టిటిడీ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.
ఈ ఉత్సవాలకు సగటున రోజుకు 80 వేల మంది హాజరవుతారని, అందరూ సంతృప్తి చెందేలా సౌకర్యాలు కల్పించడం అసాధ్యమని, అంతా సహకరించాలని టిటిడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కోరారు. వీఐపీలు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరుకాకపోతేనే మంచిదని ఆయన అన్నారు. సిసి కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.
Comments
Story first published: Saturday, September 15, 2007, 23:53 [IST]