వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ నడిబొడ్డున మహిళ హత్య: దోపిడీ

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మధురానగరులో దోపిడీ దొంగలు ఒక మహిళను హత్య చేసి దోపిడీకి పాల్పపడ్డారు. సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఈ దోపిడీ జరగడం సంచలనం సృష్టించింది. మధురానగరులోని ఒక క్వార్టరులో తల్లీకూతురు నివాసం ఉంటున్నారు. కూతురు సినిమాల్లో వేషాలు వేస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో సినిమాల్లో పనిచేసే వారు ఎక్కువగా ఉంటారు.

ఉదయం కూతురు బయటకు వెళ్లడంతో తల్లి కమలాదేవి ఒక్కతే ఇంట్లో ఉంది. ఈ సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి నగలు, చీరలు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఈ

సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన కమలాదేవి మెడపై దొంగలు గాయపరిచారు. దీంతో ఆమె కింద పడిపోయి ప్రాణాలు విడిచింది. సంఘటన గురించి తెలిసిన వెంటనే కూతురు అక్కడికి చేరుకుంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏ మేరకు దోపిడీ జరిగింది తెలియడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X