హైదరాబాద్ నడిబొడ్డున మహిళ హత్య: దోపిడీ


హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మధురానగరులో దోపిడీ దొంగలు ఒక మహిళను హత్య చేసి దోపిడీకి పాల్పపడ్డారు. సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఈ దోపిడీ జరగడం సంచలనం సృష్టించింది. మధురానగరులోని ఒక క్వార్టరులో తల్లీకూతురు నివాసం ఉంటున్నారు. కూతురు సినిమాల్లో వేషాలు వేస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో సినిమాల్లో పనిచేసే వారు ఎక్కువగా ఉంటారు.

ఉదయం కూతురు బయటకు వెళ్లడంతో తల్లి కమలాదేవి ఒక్కతే ఇంట్లో ఉంది. ఈ సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి నగలు, చీరలు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఈ

సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన కమలాదేవి మెడపై దొంగలు గాయపరిచారు. దీంతో ఆమె కింద పడిపోయి ప్రాణాలు విడిచింది. సంఘటన గురించి తెలిసిన వెంటనే కూతురు అక్కడికి చేరుకుంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏ మేరకు దోపిడీ జరిగింది తెలియడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+