చిరంజీవి వస్తే సంతోషమే: వెంకయ్యనాయుడు
హైదరాబాద్:
మెగాస్టార్
చిరంజీవి
చాలా
మంచివారని,
చిరంజీవి
రాజకీయాల్లోకి
వస్తే
సంతోషమని
భారతీయ
జనతా
పార్టీ
(బిజెపి)
సీనియర్
నాయకుడు
ఎం.
వెంకయ్యనాయుడు
అన్నారు.
కేంద్రంలో
కాంగ్రెస్,
వామపక్షాల
స్నేహానికి
కాలం
చెల్లిందని
ఆయన
ఆదివారంనాడు
మీడియా
ప్రతినిధుల
సమావేశంలో
అన్నారు.
కాంగ్రెస్
అధ్యక్షురాలు
సోనియా
గాంధీ
ప్రకటనను
బట్టి
లోకసభకు
మధ్యంతర
ఎన్నికలు
ఖాయమని
తేలిపోయిందని
ఆయన
అన్నారు.
తాము
ఎన్నికలకు
సిధ్ధంగా
ఉన్నామని
సోనియా
చేసిన
ప్రకటనను
ఆయన
ఎద్దేవా
చేశారు.
ఎన్నికలకు
సిద్ధంగా
లేనిదెవరని
ఆయన
ప్రశ్నించారు.
కేంద్రంలోని
అసమర్థ
పాలనను
వామపక్షాలు
ఇంకా
ఎందుకు
కొనసాగనిస్తున్నాయో
అర్థం
కావడం
లేదని
ఆయన
అన్నారు.
ఇంటెన్సివ్
కేర్
యూనిటులో
వెంటిలేటరు
మీద
ఉన్న
కాంగ్రెసు
పాలనను
వామపక్షాలు
ఇంకా
కొనసాగనీయడం
విడ్డూరమని
ఆయన
అన్నారు.
కర్ణాటకలో
జెడి
(ఎస్)
అధికార
మార్పిడికి
అంగీకరించకపోవడం
వెనక
కాంగ్రెస్
కుట్ర
ఉందని
ఆయన
విమర్శించారు.
ప్రజలే
జెడి
(ఎస్)కు
గుణపాఠం
చెబుతారని
ఆయన
అన్నారు.