వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews


శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగుల దాడిలో తాజాగా ఇద్దరు మరణించారు. ఈ సంఘటన సీతంపేట మండలంలోని కె. వీరఘట్టం గ్రామం వద్ద జరిగింది. ఇటీవల విజయనగరం జిల్లాలో ఏనుగులు దాడి చేసి ఒక బాలుడ్ని చంపిన సంఘటన మరిచిపోకముందే ఈ సంఘటన చోటుచేసుకోవడం ఏజెన్సీ ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.

పక్క ఊరిలోని జాతరకు ఆదివారం రాత్రి 9 మంది వ్యక్తులు బయలుదేరారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఏనుగులు వారిపై దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు మరణించగా మిగతా ఏడుగురు తప్పించుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X