శ్రీజ నిర్ణయాన్ని ఆమోదించాం: చిరంజీవి
న్యూఢిల్లీ: తన కూతురు శ్రీజ నిర్ణయాన్ని తాను, తన కుటుంబం ఆమోదించామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయన శ్రీజ దంపతుల తరఫు న్యాయవాది పింకీ ఆనంద్ కు ఒక లేఖ రాశారు. ఈ లేఖను ఆమె ఢిల్లీ హైకోర్టుకు అందజేశారు. తన అభిమానుల నుంచి శ్రీజ దంపతులకే కాదు, ఎవరికీ హాని చేయరని ఆయన అన్నారు. తాము ఆశీర్వదించిన తర్వాత కూడా శ్రీజ దంపతులు జాతీయ మీడియాలో తమపై ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలు తమకు బాధ కలిగించాయని ఆయన అన్నారు.
శ్రీజ దంపతులపై తమకు ఏ విధమైన కోపమూ లేదని ఆయన అన్నారు. వారికి రక్షణ కావాలంటే తాము చెప్పేదేమీ లేదని, అది వారిష్టమని ఆయన అన్నారు. పదే పదే శ్రీజ దంపతులు తమపై ఆరోపణలు చేయడం బాధ కలిగించిందని ఆయన అన్నారు. తమ నుంచి శ్రీజ దంపతలకు ఏ విధమైన హానీ ఉండదని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశం మేరకు చిరంజీవి శ్రీజ దంపతులకు ప్రమాదం ఉండదని ఆ లేఖను సమర్పించారు.












Click it and Unblock the Notifications