మీడియాపై భూమిక చిందులు
హైదరాబాద్: ప్రముఖ సినీనటి భూమిక మీడియాపై చిందులు తొక్కారు. సెల్ ఫోన్లు ఆఫ్ చేయాలని మీడియా ప్రతినిధులను ఆదేశించారు. మీడియా ప్రతినిధులపై ఆమె చిర్రుబుర్రులాడారు. సినీ ప్రమోషన్ కార్యక్రమంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది.
కార్యక్రమం జరుగుతుండగా ఒక జర్నలిస్టు సెల్ ఫోన్ మోగింది. దాంతో భూమిక అసహనం ప్రదర్శిస్తూ - సెల్ ఫోన్లు స్విచాఫ్ చేయాలని, లేదంటే బయటకు వెళ్లాలని కసురుకున్నారు. దీంతో జర్నలిస్టులు షాక్ తిన్నారు. ఈ సినిమాలో భూమికది జర్నలిస్టు పాత్ర కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications