వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నందిగ్రామ్‌ పై వెనక్కి తగ్గిన బుద్ధదేవ్

By Staff
|
Google Oneindia TeluguNews
Budhadev Bhattacharya
నందిగ్రామ్: నందిగ్రామ్‌లో ప్రభుత్వం భూసేకరణ జరపబోదని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య హామీ ఇచ్చారు. ఈ ఏడాది జనవరిలో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) కోసం ప్రభుత్వం భూసేకరణ జరపడాన్ని స్థానికులు వ్యతిరేకించడంతో అక్కడ హింసాత్మక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. మార్చి 14న భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో సుమారు 25 మంది మరణించారు.జనవరి తరువాత బుద్దదేవ్ భట్టాచార్య తొలిసారి బుధవారంనాడు నందిగ్రామ్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన నందిగ్రామ్ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఓ సమగ్ర ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం నందిగ్రామ్‌లో బలవంతంగా భూసేకరణ జరపబోదని హామీ ఇచ్చారు.

ప్రభుత్వానికి మార్చిలో కాల్పులు జరపాలనే ఆలోచనే లేదని, అయితే ప్రతిపక్షం కారణంగా పరిస్థితి కాల్పులకు దారితీసిందని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రభుత్వమూ ప్రజలను పోలీసులచే చంపిచాలని అనుకోదని ఆయన చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా నందిగ్రామ్ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేసేందుకే ఇక్కడకు వచ్చానని తెలిపారు. పక్కనున్న హల్దియా మాదిరిగా నందిగ్రామ్‌ను పారిశ్రామిక పట్టణంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించిందని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X