దాదర్ ఎక్సుప్రెస్ కు తప్పిన ప్రమాదం
అనంతపురం: దాదర్ - చెన్నై ఎక్సుప్రెస్ రైలుకు సోమవారం తృటిలో ప్రమాదం తప్పింది. రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాయలచెరువు - జొక్కలచెరువు మధ్య చోటు చేసుకుంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో రైలును ఆపడం వల్ల ప్రమాదం తప్పింది.
గుంతకల్లు నుంచి మరో ఇంజనును తెప్పించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్కడ ఓ లెవెల్ క్రాసింగ్ ఉంది. రైలు వస్తుండడాన్ని గమనించకుండా లోడ్ తో ఉన్న లారీని డ్రైవర్ లెవెల్ క్రాసింగ్ ను దాటించడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో రైలు లారీ ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. లారీ డ్రైవర్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications