బలరాంపై హక్కుల హక్కుల నోటీసు
హైదరాబాద్: స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం శాసనసభ్యుడు కరణం బలరాంపై కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సియల్పీ) సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ పట్ల ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఇతర తెలుగుదేశం సభ్యులు వ్యవహరించిన తీరుపై సిడిలను, పత్రికా ప్రటకనలను సియల్పీ ప్రతినిధులు ఎరాసు ప్రతాపరెడ్డి, తదితరులు స్పీకరుకు ఆదివారంనాడు సమర్పించారు. ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటానని స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి చెప్పారు. తనకు అందిన ప్రస్తుత సభా హక్కుల ఉల్లంఘన నోటీసు గతంలో కన్నా భిన్నమైందని ఆయన అన్నారు.
మీరు సభాధ్యక్ష స్థానంలో ఉన్నంత వరకు సభను జరగనీయబోమని కుతూహలమ్మతో చంద్రబాబు అనడం సంప్రదాయం కాదని, డిప్యూటీ స్పీకరు మీద అపనమ్మకం ప్రదర్శించడమేనని సియల్పీ ప్రతినిధులు అన్నారు. సభా విధానాలు తెలిసినవారు కూడా ఇలా వ్యవహరించడం మంచి సంప్రదాయం కాదని వారన్నారు. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కష్టాల్లో పడినట్లే.












Click it and Unblock the Notifications