ఢిల్లీకి చేరుకున్న బీజింగ్ ఒలింపిక్ జ్యోతి
న్యూఢిల్లీ: బీజింగ్ ఒలింపిక్ జ్యోతి గురువారం దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకుంది. పాకిస్థాన్ నుంచి ప్రత్యేక విమానంలో ఈ జ్యోతిని గట్టి బందోబస్తు మధ్య ఈ జ్యోతిని ఇక్కడకు తీసుకొచ్చారు. జ్యోతి ఇక్కడకు చేరుకున్న వెంటనే ఆర్మీ వాహనంలో వందలాది మంది భద్రాతా సిబ్బంది బందోబస్తు మధ్య ఓ రహస్య ప్రదేశానికి తరలించారు. ఈ రోజు భారత్లో ఒలింపిక్ జ్యోతి రేలే జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ జ్యోతిని ఎక్కడకు తీసుకెళుతున్న సంగతి వెల్లడికాలేదు. ఈ జ్యోతి ప్రపంచ రిలేకు అడుగడుగునా టిబెట్ నిరసనకారులు, మానవహక్కుల సంస్థలకు ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ టిబెటియన్లు అధిక సంఖ్యలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జ్యోతి రిలే నిరాటంకంగా సాగేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.












Click it and Unblock the Notifications