ధరలపై మంత్రుల నివేదికలకు ఆదేశం

YS Rajasekhar Reddy
హైదరాబాద్: నిత్యావసర సరుకుల ధరలపై గురువారం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమీక్షించారు. నిత్యావసర సరుకుల ధరలపై అధ్యయనం చేసి, నివేదికలు సమర్పించడానికి ముఖ్యమంత్రి మంత్రులతో రెండు కమిటీలు వేశారు. మంత్రులు రఘువీరా రెడ్డి, కాసు కృష్ణా రెడ్డి, మారెప్ప కూరగాయల ధరలను సమీక్షించి, ధరలు తగ్గించడానికి గల మార్గాలపై నివేదిక సమర్పిస్తారు. అలాగే, పప్పుదినులు, నూనెలు, సిమెంటు ధరలు తగ్గించే విషయంపై మంత్రులు రోశయ్య, బొత్సా సత్యనారాయణ, కొణతాల రామకృష్ణ నివేదిక సమర్పిస్తారు.

రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికలపై మంత్రివర్గ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసికెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెరాస ప్రాతినిధ్యం వహించిన శాసనసభా నియోజకవర్గాలు అభివృద్ధిలో వెనకబడిన విషయాన్ని ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. కడప పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. క్రీడానిధి ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధరలను ఒకటి, రెండు రోజుల్లో తగ్గించడానికి ప్రయత్నాలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+