ఎన్నికల ప్రచారానికి బాబు శ్రీకారం

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటోను రేషన్ కార్డులపై కాకుండా బెల్టు షాపులపై పెడితే బాగుంటుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. తాము అధికారంలోకి వస్తే 500 జనాభా ఉన్న ప్రతి గిరిజన తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గొర్రెల కాపరులకు పది పైసల వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పారు. మైదాన ప్రాంతంలోని గిరిజనుల కోసం ఐటిడిఎ లాగా ఒక సంస్థను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు. సన్న, చిన్నకారు రైతుల రుణాలను అన్నింటినీ మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications