చిరు పార్టీపై వైయస్ పరోక్ష వ్యాఖ్య

YS Rajasekhar Reddy
హైదరాబాద్: కొత్తగా రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా ఇబ్బంది లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అన్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారనే వార్తలపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మంగళవారంనాడు ఆ వ్యాఖ్య చేశారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ నేతల్లో భయం పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మరో వారంలో బ్యాంకుల వద్ద వ్యవసాయ రుణ మాఫీల మేళాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుకు 230 శాసనసభా సీట్లు, 36 పార్లమెంటు స్థానాలు రావాలని ఆయన అన్నారు.

ఈ ఏడాది నుంచి గ్రామం యూనిటుగా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో నాయకుల కన్నా కార్యకర్తలే బాగా పని చేశారని, నాయకులకు నమ్మకం లేకుండా పోయిందని ఆయన అన్నారు. కార్యకర్తలే బాగా పని చేశారని ఆయన కొనియాడారు. వ్యవసాయాన్ని పండుగలా భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో విశ్వసనీయతను నిరూపించుకున్నామని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో తాను తెలుగుదేశం పార్టీని గానీ తెలంగాణ రాష్ట్ర సమితిని గానీ తిట్టలేదని, ప్రభుత్వం చేసిన పనులనే వివరించానని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసికెళ్లాలని పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సూచించారు. కార్యకర్తలను పట్టించుకోకపోతే ఎన్ని అభివృద్ధి పథకాలను చేపట్టినా లాభం లేదని పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కూడా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+