చిరు తొవ్వలో దేవేందర్ పార్టీ?

నవంబర్ ఒకటవ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే రెండో తేదీన తామే స్వయం పరిపాలనను ప్రకటించుకుంటామని దేవేందర్ గౌడ్ చెప్పారు. ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ పేరున ఉన్న బోర్డులను తొలగిస్తామని, వాహనాల నెంబర్ ప్లేట్లను మార్చేస్తామని ఆయన చెప్పారు. నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలను బహిష్కరిస్తామని ఆయన చెప్పారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి గ్రామగ్రామన తెలంగాణ ఉద్యమాన్ని చేపడుతామని ఆయన చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన సత్యాగ్రహాలు చేస్తామని ఆయన చెప్పారు. నిజాం కళాశాల మైదానంలో జరిగిన నవ తెలంగాణ రాష్ట్ర పార్టీ బహిరంగ సభకు తెలంగాణ నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. పార్టీ ముసాయిదాను కూడా ఆయన ఈ సభలో విడుదల చేశారు.












Click it and Unblock the Notifications
