మనమూ జాగ్రత్త వహించాలి: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: మనమూ జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తమ పార్టీ శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఆ మేరకు పిలుపునిచ్చారు. మనం మరింత సమర్థంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ అవినీతి ప్రజల్లోకి తీసికెళ్లాలని ఆయన సూచించారు. స్పీకరుపై అవిశ్వాసం తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు.

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి శాసనసభను నిర్వీర్యం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా తమ శాసనసభ్యుడు కరణం బలరాంను ఆరు నెలల పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+