స్పీకరును అవమానించారు: డిఎస్

ప్రభుత్వంపై ఎన్ని రకాలైనా విమర్శలు చేయవచ్చునని, కానీ స్పీకరుపై విమర్శలు చేయడం సరి కాదని, ప్రజలు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. సురేష్ రెడ్డి హుందాతనం, పద్ధతి తెలిసిన వ్యక్తి అని, మంచివారని ఆయన కొనియాడారు. నిబంధనలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక్క రోజు కూడా సభను పూర్తిగా నడనివ్వలేదని ఆయన అన్నారు. సోమనాధ్ ఛటర్టీ లోకసభ స్పీకరుగా వ్యవహరించిన తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుందని, ఛటర్జీ తీరు వారి పార్టీకి కూడా నచ్చలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications