ఖైర్లాంజి కేసులో 6గురికి ఉరిశిక్ష

నాగపూర్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖైర్లాంజి కేసులో ఆరుగురు దోషులకు స్థానిక భండారా సెషన్స్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో ఇద్దరికి యావజ్జీవశిక్ష విధించింది. ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా కోర్టు అభివర్ణించింది. ఈ కేసులో మొత్తం 8 మందికి ఉరిశిక్ష విధించాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించారు. 2006 సెప్టెంబరు 29న నాగపూర్‌ సమీపంలోని ఖైర్లాంజి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

ఇది ముదిరి ఓ దళిత కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను మరో వర్గంవారు చంపి కాలువలో పడేశారు. ఈ కేసును మొదట గ్రామంలో ఘర్షణగా చూసినా అనంతరం ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కిందకు చేర్చారు. ఈ కేసును విచారించిన సీబీఐ 46 మందిని నిందితులుగా పేర్కొంది. చివరకు 11మందిపై ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+