చంద్రబాబే సిఎం అవుతారు: అశ్వినీదత్

Ashwini Dutt
గుంటూరు: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే అలంకరిస్తారని సినీ నిర్మాత అశ్వినీదత్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులో బుధవారం జరిగే యువగర్జనకు హాజరయ్యేందుకు బయలుదేరిన కార్యకర్తల కార్ల ర్యాలీని అశ్వినీదత్ మంగళవారం ప్రారంభించారు. ఎంతమంది వీడినా పార్టీకి ఎలాంటి నష్టం లేదని, కార్యకర్తలు పార్టీ వెంటే ఉన్నారని అశ్వినీదత్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపును విజయం సాధించనున్న తెలుగుదేశం పార్టీని వదిలి ఇతర పార్టీల్లోకి వలసలు పోవడం వారి దురదృష్టమని చెప్పారు.

ఇదిలా ఉండగా, గుంటూరులో జరుగనున్న టీడీపీ యువగర్జనకు రంగం సిద్ధమైంది. ఈ గర్జన ద్వారా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ దశలో గుంటూరు జిల్లాలో బుధవారం నిర్వహించనున్న యువగర్జన సభతో రాష్ట్రంలో తమకు కొత్త శక్తి లభిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశ్వసిస్తున్నారు. ఒకవైపు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రజల్లోకి వెళుతూ విస్తృత పర్యటనలు చేపడుతుండగా, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సదస్సుల పేరిట ప్రజలను పలకరిస్తోంది. ఇలాంటి సమయమే యువగర్జనకు సరైందని తెలుగుదేశం పార్టీ భావించి గర్జనకు వేదికను సిద్ధం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+