హైదరాబాద్: బెల్టుషాపులను ప్రభుత్వం మూయించాలని లేకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఇప్పటికే ప్రకటించిన లోక్సత్తా పార్టీ అందుకు శ్రీకారం చుట్టింది. ఈరోజు రంగారెడ్డి జిల్లా మోమిన్పేట మండలం ఎన్కతలలో పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్నారాయణ్ సారథ్యంలో ఈ దాడి చేశారు. బెల్టుషాపులపై దాడిచేసి మద్యం సీసాలను పగులగొట్టారు. ప్రభుత్వమే తాగుబోతులను తయారుచేయటాన్ని ఈ సందర్భంగా వారు తప్పుపట్టారు.