కెసిఆర్ ప్రకటనను ఖండించను: డిఎస్

D Srinivas
హైదరాబాద్: తెలంగాణ అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రకటనను తాను ఖండించబోనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. తాను చంద్రశేఖరరావును కలుసుకోక చాలా కాలమైందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. 2004లో తాను టికెట్లు అమ్ముకున్నాననే ఆరోపణలపై ఏమీ మాట్లాడబోనని ఆయన అన్నారు. అదే నిజమైతే మొనగాళ్లయితే ఆ రోజే చెప్పి ఉండాల్సిందని, పార్టీని వీడిపోతూ చెప్పడమేమిటని ఆయన అన్నారు. తాను టికెట్లు అమ్ముకుని ఉంటే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ఉండేది కాదని ఆయన అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. పాత మిత్రులకు తలుపులు తెరిచే ఉన్నాయని ఆయన చెప్పారు.

పులివెందుల ఘటనపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా దాడులు మంచి సంప్రదాయం కాదని ఆయన అన్నారు. తెలంగాణపై ఎన్నికల లోపు తమ పార్టీ అధిష్ఠానవర్గం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. తాను అంతవరకు మాత్రమే చెప్పగలనని, తెలంగాణ ఇస్తారా ఇవ్వరా ఏం చేస్తారు అనే విషయం చెప్పలేనని ఆయన అన్నారు. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం కాబట్టి తెలంగాణపై ప్రజలు ప్రశ్నిస్తారని, అందువల్ల ఏదో ఒకటి ప్రజలకు చెప్పక తప్పదని, అందువల్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రెండో ఎస్సార్సీ వేస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పాం కదా, ఎందుకు వేయలేదని ప్రజలు అడుగుతారు కదా అని ఆయన అన్నారు. తెలంగాణపై పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయం ఏదైనా ఉండవచ్చునని, ఇలాగే వెళ్తామంటే మాత్రం కుదరదని ఆయన అన్నారు. తెలంగాణపై అధిష్ఠానవర్గం నిర్ణయాన్ని తమ పార్టీ రాష్ట్ర నాయకులంతా అంగీకరిస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+