అధికారం ప్రజారాజ్యానిదే: చిరంజీవి

అభివృద్ధిని ప్రజల ముందుకు తేవడానికి తాను కృషి చేస్తానని ఆయన చెప్పారు. ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని, తన వెనక ప్రజలున్నారని, వారి వెనక తానున్నానని ఆయన అన్నారు. మనల్ని మనమే పాలించుకుందామని, ఇందులో మనల్ని మనం మోసం చేసుకోవడం ఉండదని, మనల్ని మనం కబ్జా చేసుకోవడం ఉండదని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలకు ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. కడప జిల్లా మైదుకూరులో చిరంజీవి రోడ్డు షోకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ముగ్గురికి విద్యుత్ షాక్ తగిలింది. వారిలో ఒక వ్యక్తి మరణించాడు.












Click it and Unblock the Notifications